నవతెలంగాణ-హైదరాబాద్: దేశరాజధాని ఢిల్లీలో ఉద్రిక్తత నెలకొంది. సీఎం రేఖా గుప్తా ఎన్నికల హామీలను నెరవేర్చలేదని, మహిళలకు నెలకు ఉచితంగా రూ.2500 నగదు అందించేందకు ప్రవేశపెట్టిన మహిళ సమృద్ధి యోజన పథకాన్ని వెంటనే అమలు చేయాలని సీఎం కార్యాయాలనికి ఆమ్ ఆద్మీ నేతలు(AAP) ర్యాలీ చేపట్టారు. ఢిల్లీలోని రాంలీలా మైదాన్ నుంచి ఆ పార్టీశ్రేణులు భారీ స్థాయిలో దేశరాజధానిలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ప్లకార్డులు చేతబూని బీజేపీ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఆప్ శ్రేణులను అడ్డుకున్నారు. గతేడాది మార్చి 8న మహిళ దినోత్సవం సందర్భంగా జేపీ నడ్డా ఇచ్చిన మాట నిలుపుకోవాలని ఆప్ నేతలు డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడి నేటికి 100రోజులు గడుస్తున్న ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, ఢిల్లీ వాసులను సీఎం రేఖా గుప్తా మోసం చేస్తుందని ఆప్ నేతలు విమర్శించారు.
ఇదిలా వుండగా ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి నేటితో 100 రోజులు పూరైంది. ఈ సందర్భంగా సీఎం రేఖగుప్తా వంద దిన్ సేవా కార్యక్రమం అనే ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈక్రమంలో ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ ఆప్…. బీజేపీ ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని, స్త్రీలకు నెలకు రూ.2500నగదు అందించే మహిళ సమృద్ది యోజన పథకాన్ని తక్షణమే అమలు చేయాలని ఆప్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆందోళనకారులను అడ్డుకొని ఎక్కడికక్కడ ఆ పార్టీశ్రేణులను నిలువరించారు పోలీసులు.