నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన కఠిన వలస విధానాలపై దేశవ్యాప్తంగా నిరసనల పర్వం కొనసాగుతోంది . ముఖ్యంగా లాస్ ఏంజెల్స్ నగరంలో నాలుగో రోజు ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరాయి. పరిస్థితిని నియంత్రించేందుకు 700 మంది మిలటరీ మరిన్స్ను తాత్కాలికంగా మోహరించనున్నట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే గ్రౌండ్లో ఉన్న నేషనల్ గార్డ్ బలగాలకు మద్దతుగా ఈ మిలటరీ మోహరింపు జరుగుతోంది. ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో 2,000 మంది నేషనల్ గార్డ్ సిబ్బందిని పంపాలని ఆదేశించారు. దీంతో మొత్తం నగరంలో 4 వేల మంది నేషనల్ గార్డ్స్ ఆందోళనల్ని అడ్డుకునే పనిలో ఉన్నారు. ఇన్సరెక్షన్ యాక్ట్ ను ఇప్పటివరకు అమలులోకి తీసుకురాలేదు. ఆ చట్టం అమలయితే మిలటరీ సైన్యం నేరుగా పోలీసు విధుల్లో పాల్గొనగలదు.
లాస్ ఎంజెల్స్ లో కొనసాగుతున్న ఉద్రిక్తత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES