- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలోని అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఏఎల్పురం జడ్పీ హైస్కూల్లో టెన్త్ విద్యార్థిని వింజరపు దుర్గాలక్ష్మి తరగతి గదిలో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులకు ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించింది. లేఖలో ‘అమ్మా, నాన్న క్షమించండి. తమ్ముడిని బాగా చూసుకోండి. నాకు స్నేహితులందరూ ఇష్టమే. తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. గత కొద్దిరోజులుగా బాలిక ముభావంగా ఉన్నట్లు తోటి స్నేహితులు చెప్పినట్లు సమాచారం. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



