Monday, June 16, 2025
E-PAPER
Homeజాతీయంకాంగ్రెస్ పాల‌న‌లో ప్ర‌తిరోజు ఉగ్ర‌దాడులు: అమిత్ షా

కాంగ్రెస్ పాల‌న‌లో ప్ర‌తిరోజు ఉగ్ర‌దాడులు: అమిత్ షా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కాంగ్రెస్ పాల‌న‌లో ఉగ్ర‌వాదుల దాడుల‌ను అరిక‌ట్ట‌డంలో విఫ‌ల‌మైయ్యార‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మోడీ పాల‌న‌లో ఉగ్ర‌దాడులు జ‌రిగితే..దీటైన స‌మాధానం ఇచ్చామ‌న్నారు. ఉరి పై దాడి చేస్తే స‌ర్జిక‌ల్ దాడి చేశామ‌ని, పుల్వామా ఎటాక్‌కు ప్ర‌తీకారంగా వైమానిక దాడిచేశామ‌ని, పహ‌ల్గాం మార‌ణోమంతో..ఆప‌రేష‌న్ సింధూర్‌తో పాకిస్థాన్ లోని ఉగ్ర‌వాద‌ల‌ను అంతంచేశామ‌ని అమిత్ షా గుర్తు చేశారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో కొత్తగా ఎంపికైన 60,000 మందికి పైగా పోలీసు కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందించే కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ర‌క్త‌పాతం సృష్టించ‌డం భార‌త్ ఉద్దేశ్యంకాదు..ఇండియాపై దాడి చేయ‌డానికి ధైర్యం చేస్తే..ఖ‌చ్చితంగా వారికి త‌గిన గుణ‌పారం చెపుతామ‌ని కేంద్ర హోంమంత్రి అన్నారు. 2014కి ముందు కాంగ్రెస్ పాలనలో ప్రతిరోజూ ఉగ్రవాద దాడులు జరిగాయ‌ని ఆయ‌న ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -