Friday, May 2, 2025
Homeజాతీయంపంజాబ్‌లో ఉగ్ర‌కుట్ర భ‌గ్నం..ప‌లు ఆయుధాలు స్వాధీనం

పంజాబ్‌లో ఉగ్ర‌కుట్ర భ‌గ్నం..ప‌లు ఆయుధాలు స్వాధీనం

న‌వతెలంగాణ‌- హైద‌రాబాద్‌: ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడితో దేశ‌వ్యాప్తంగా జాతీయ భ‌ద్ర‌తాపై కేంద్ర ప్ర‌భుత్వం హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో దేశ స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో ఎల్ల‌వేళాల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆయా భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా తీవ్ర‌వాద కార్యకాలపాల‌ను క‌ట్ట‌డి చేయ‌డానికి సెర్చ్ ఆప‌రేష‌న్ కూడా కొన‌సాగుతుంది. ఈ క్ర‌మంలో పంజాబ్ స‌రిహ‌ద్దులో భారీ ఉగ్ర‌కుట్ర‌ను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు భ‌గ్నం చేశాయి. అమృత్ స‌ర్ జిల్లా భ‌ర్‌పోల్ గ్రామంలో బీఎస్ఎఫ్-ఆ రాష్ట్ర పోలీసులు సంయుక్తం చేప‌ట్టిన సెర్చ్ ఆప‌రేష‌న్‌లో ప‌లు ఆయుధాలు గుర్తించాయి. బాంబులు, మూడు పిస్ట‌ల్స్, ఆరు మ్యాగ‌జైన్స్, 50రౌండ్ల‌కు స‌రిపోయే బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు పోలీసులు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img