- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు అని ప్రధాని మోడీ అన్నారు. దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భారత పర్యటనలో ఉన్న అంగోలా అధ్యక్షుడు జువా లోరెన్సోతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. అనంతరం వీరిద్దరూ కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా పహల్గాం ఉగ్రదాడి ఘటనను మోదీ ప్రస్తావించారు. పహల్గాం దాడి నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అంగోలా మద్దతు పలికింది. అందుకు ఆ దేశానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇచ్చేవారిపై కఠినమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడానికి మేం కట్టుబడి ఉన్నాం’’ అని మోడీ పునరుద్ఘాటించారు.
- Advertisement -