నవతెలంగాణ-హైదరాబాద్: భారత్లో విద్యుత్ కార్ల తయారీ పరిశ్రమను టెల్సా నెలకొల్పదని కేంద్రం సోమవారం ప్రకటించింది. భారత్లో కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు టెల్సా సుముఖంగా లేదని కేంద్ర పరిశ్రమల మంత్రి కుమారస్వామి ప్రకటించారు. అయితే ఆ సంస్థ దేశవ్యాప్తంగా కార్ల షోరూమ్స్ను ప్రారంభించవచ్చని అన్నారు. భారత్లో విద్యుత్ కార్ల తయారీని ప్రోత్సహించే పథకానికి సంబంధించి మార్గదర్శకాలను ఆవిష్కరించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టెల్సా భారత్లో కార్ల షోరూమ్లను ప్రారంభించేందుకు మాత్రమే ఆసక్తి చూపుతున్నారని అన్నారు. అంతర్జాతీయ సంస్థలైన మెర్సిడెస్ బెంజ్, స్కోడా-వోక్స్వాగన్, హుండారు మరియు కియాలు భారత్లో విద్యుత్ కార్లను తయారు చేసేందుకు ముందుకు వచ్చాయని అన్నారు.
విద్యుత్ కార్ల తయారీని ప్రోత్సహించే అంశంపై భాగస్వామ్యులతో జరిగిన మొదటి రౌండ్ చర్చల్లో టెల్సా ప్రతినిధి పాల్గొన్నారని, రెండవ, మూడవ రౌండ్ చర్చలకు ఆయన హాజరుకాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై వారు ఆసక్తిగా లేరని పేర్కొన్నాయి. కంపెనీ బాధ్యతల కారణంగా తన భారతదేశ పర్యటన ఆలస్యమైందని గతేడాది ఏప్రిల్లో టెస్లా సిఇఒ మస్క్ పేర్కొన్నారు. టారిఫ్లను తప్పించుకునేందుకు భారత్లో కార్ల కంపెనీని ప్రారంభిస్తే.. అది అమెరికాకు అన్యాయం చేసినట్లే అవుతుందని అమెరికా అధ్యక్షులు ట్రంప్ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.