Monday, September 15, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ‌లో ఇవాళ నుంచి టెట్ పరీక్షలు

తెలంగాణ‌లో ఇవాళ నుంచి టెట్ పరీక్షలు

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నుంచి టెట్ పరీక్షలు ప్రారంభమై.. జూన్ 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు రెండు షిఫ్టులలో ఆన్‌లైన్‌ పద్దతిలో నిర్వహించబడతాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు జరగనుండగా.. రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 2:00 నుంచి 4:30 గంటల వరకు కొనసాగనుంది. సుమారు తొమ్మిది రోజుల పాటు 16 సెషన్‌లలో పరీక్షలు జరగనున్నాయి. 15 జిల్లాల్లో 66 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే, ఈ పరీక్షలకు 1, 83, 653 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -