ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న, శేఖర్ కమ్ముల కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘కుబేర’. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం యునానిమస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
అద్భుతమైన బుకింగ్స్తో సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ నిర్వహించిన సక్సెస్మీట్లో నాగార్జున మాట్లాడుతూ,’ఫస్ట్ టైమ్ యునానిమస్గా బ్లాక్బస్టర్ రివ్యూలు వచ్చాయి. శేఖర్తో నాకు ఎప్పటి నుంచో సినిమా చేయాలని ఉంది. ఫైనల్గా మా కాంబినేషన్లో ‘కుబేర’ వచ్చింది. నాకు ఎప్పటినుంచో ఒక కొత్త క్యారెక్టర్ చేయాలని ఉండేది. శేఖర్ సినిమాలన్నీ చూశాను. ఆయన క్యారెక్టర్కి అద్భుతంగా న్యాయం చేస్తారు. ఈ కథ వినగానే నాది మెయిన్ క్యారెక్టర్ అనిపించింది. ప్రతి పాత్ర కూడా నేను చేసిన దీపక్ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది. దీపక్ క్యారెక్టర్ ఆర్క్ అద్భుతంగా ఉంటుంది. నా క్యారెక్టర్కి వచ్చిన రెస్పాన్స్ గొప్ప ఆనందం ఇచ్చింది. ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు’ అని అన్నారు.
నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ,’ మా సినిమా పెద్ద సూపర్ హిట్. సినిమా ఫలితం పట్ల చాలా ఆనందంగా ఉన్నాం. శేఖర్ కమ్ముల గ్రేట్ డైరెక్టర్. బుకింగ్స్ టెర్రిఫిక్గా ఉన్నాయి. ఇది డే బై డే పెరుగుతూ వెళుతుంది. ఎక్కడా తగ్గదు’ అని అన్నారు.
‘శేఖర్ అద్భుతమైన సినిమా ఇచ్చారు. సినిమాకి ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ రిపోర్ట్ వచ్చింది. ఈ క్రెడిట్ అంతా టీం అందరికీ దక్కుతుంది. నిర్మాతలుగా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. నాగార్జునకి, ధనుష్కి, శేఖర్కి థ్యాంక్యూ. ఇంత అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకి కతజ్ఞతలు’ అని నిర్మాత పుస్కూర్ రామ్మోహనరావు చెప్పారు.
చాలా ఎమోషనల్గా ఉంది. ఇది సామాన్యమైన సినిమా కాదు. సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా అని ప్రీరీలీజ్ ఈవెంట్లో చెప్పాను. అది ఈరోజు నిజమైంది. నేను చేసిన సినిమాల్లో ఇది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్, హానెస్ట్, ట్రూ ఫిలిం. నాగ్, ధనుష్ పర్ఫార్మెన్స్కి థియేటర్స్లో వస్తున్న రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. చాలా మంచి టేకింగ్.. డైరెక్షన్.. ప్రొడక్షన్.. అన్నింటి గురించి ప్రేక్షకులు
చాలా గొప్పగా మట్లాడటం చాలా గర్వంగా ఉంది.
– డైరెక్టర్ శేఖర్ కమ్ముల
బ్లాక్బస్టర్ హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు
- Advertisement -
- Advertisement -