సకుటుంబంగా సినిమాలను చూసే చిత్రాలను రూపొందించి తెలుగు చిత్ర పరిశ్రమకు మర్చిపోలేని ఘన విజయాలు అందించిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. 32 ఏళ్ల కెరీర్లో 42 ఎవర్ గ్రీన్ మూవీస్ రూపొందించారు. ఆదివారం ఆయన పుట్టినరోజు వేడుకల్ని హైదరాబాద్ ఎఫ్ఎన్సీసీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, ఆమని, ఇంద్రజ, లయ, అలీ, శివాజీ రాజా, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, చంద్రబోస్, రవళి, రాజేంద్ర ప్రసాద్, రోజా, మురళీమోహన్, బండ్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ, ‘నన్ను హీరోగా నిలబెట్టిన ఫిల్లర్స్ లాంటి దర్శకులు ఇద్దరు …ఒకరు ఈవీవీ సత్యనారాయణ, మరొకరు ఎస్వీ కృష్ణారెడ్డి. ‘ఘటోత్కచుడు’ చిత్రంలో అర్జునుడిగా నటించాను. అది మా కాంబినేషన్లో మొదటి సినిమా. ఆ తర్వాత ‘వినోదం, ఎగిరే పావురమా, ఆహ్వానం..’ ఇలా పది చిత్రాలు చేశాను. నేను హీరోగా ఎదిగేందుకు ఆయన సినిమాలన్నీ ఎంతో ఉపయోగపడ్డాయి’ అని అన్నారు. ‘ఎస్వీ కృష్ణారెడ్డి మా కుటుంబంలో పెద్ద లాంటి వారు. ఆయన నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు’ అని లిరిసిస్ట్ చంద్రబోస్ చెప్పారు. బ్రహ్మానందం మాట్లాడుతూ, ‘ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. మా ఇంట్లో ఇవాళ ఇంపార్టెంట్ వేడుక ఉన్నా ఇక్కడికి వచ్చాను. కృష్ణారెడ్డి పుట్టినరోజు ఈవెంట్లో పాల్గొనకపోతే తప్పుచేసిన భావం కలుగుతుంది. ఆయనతో మాకున్న అనుబంధం అలాంటిది. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి రామలక్ష్మణుల లాంటి వారు’ అని తెలిపారు.
నటి లయ మాట్లాడుతూ, ‘ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో పనిచేసే అవకాశం నాకు దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు మళ్లీ అవకాశం ఉంటే ఆయన దర్శకత్వంలో నటించాలని ఉంది’ అని చెప్పారు. ‘దర్శకుడు కేవీ రెడ్డి గారిని ఎస్వీ కృష్ణారెడ్డి స్ఫూర్తిగా తీసుకున్నాడు. దర్శకరత్న దాసరికి ఏకలవ్య శిష్యుడిని అని ఎస్వీ చెప్పుకునేవారు. మా కాంబినేషన్లో గొప్ప చిత్రాలు రూపొందించాడు’ అని నిర్మాత అచ్చిరెడ్డి అన్నారు.
ఎస్వీ కృష్ణారెడ్డి ప్రత్యేకత అదే..
- Advertisement -
- Advertisement -