Wednesday, June 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డి పై దాడి హేయమైన చర్య.! 

జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డి పై దాడి హేయమైన చర్య.! 

- Advertisement -

– నిందితులపై చర్యలు తీసుకోవాలి
– టియుడబ్ల్యూజె (ఐజెయూ)జిల్లా కోశాధికారి కుమార్ యాదవ్
నవతెలంగాణ-మల్హర్ రావు : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని నార్లపూర్ గ్రామానికి చెందిన జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేయడం హేయమైన చర్యని,ప్రభుత్వం నిందితులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని టియుడబ్ల్యూజె (ఐజెయు) భూపాలపల్లి జిల్లా కోశాధికారి చింతల కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.టియుడబ్ల్యూజె జిల్లా కమిటీ ఆదేశాలతో బుధవారం మండలంలోని కొయ్యుర్ ప్రెస్ క్లబ్ లో మండల ప్రధాన కార్యదర్శి శనిగల లక్ష్మన్ తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు శ్రీకాంత్ రెడ్డిపై మంగళవారం సాయంత్రం కొంతమంది దుండగులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే జర్నలిస్టులపై దాడులు నిరంతరం కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడాలే తప్ప, దాడులు చేయడం ఎంతవరకు సమంజసంని ప్రశ్నించారు. శ్రీకాంత్ రెడ్డిపై దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.లేనిపక్షంలో సంఘాలకు అతీతంగా జర్నలిస్టులమంతా ఏకమై ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -