నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భూ సమస్యల పరిష్కారం కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని భువనగిరి తాసిల్దార్ అంజిరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని నందనం, చందుపట్ల గ్రామంలో భూభారతి చట్టంపై అవగాహన కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రభుత్వ భూములను పట్టా భూములకు సంబంధించి వివరాలను రైతులకు తెలియజేశారు. నందనం గ్రామంలో ప్రజల నుంచి 23 దరఖాస్తు వచ్చినట్లు, చందుపట్ల గ్రామంలో 58 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ కళ్యాణ్, ఆర్ ఐ సైదా, ఆర్ ఐ బలరాం, సీనియర్ అసిస్టెంట్ లోకేందర్ రెడ్డి, సిబ్బంది పాండు, రైతులు పాల్గొన్నారు.
భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి చట్టం…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES