- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం 2027 జనాభా లెక్కల సేకరణ కోసం ‘ప్రగతి’, ‘వికాస్’ అనే రెండు జనగణన చిహ్నాలను ఆవిష్కరించారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో స్త్రీ, పురుషుల సమాన భాగస్వామ్యానికి ఇవి ప్రతీకలని తెలిపారు. తొలిసారి డిజిటల్ రూపంలో జరగనున్న ఈ గణన కోసం సీడాక్ రూపొందించిన డిజిటల్ సాధనాలను కూడా విడుదల చేశారు. జనాభా లెక్కల సేకరణ తొలి దశ వచ్చే నెల 1 నుంచి, రెండో దశ 2027 ఫిబ్రవరిలో ప్రారంభమై మార్చి 1 నాటికి పూర్తవుతుంది.
- Advertisement -



