నవతెలంగాణ-హైదరాబాద్: ఆపరేషన్ సింధూర్ సమయంలో టర్కీ పాకిస్తాన్కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రం టర్కీకి షాకుల మీద షాకులిస్తోంది. కేంద్రం ఇండిగోను టర్కిష్ ఎయిర్లైన్స్తో తన విమానాల లీజు ఒప్పందాన్ని మూడు నెలల్లోగా ముగించాలని ఆదేశించింది. ఢిల్లీతో సహా భారత్ లోని తొమ్మిది కీలక విమానాశ్రయాలలో సేవలను నిర్వహించిన టర్కీ-సంబంధిత సంస్థ సెలెబి ఏవియేషన్కు భద్రతా అనుమతిని ప్రభుత్వం రద్దు చేసిన కొన్ని వారాల తర్వాత టర్కీకి మరో దెబ్బ తగిలేలా చేసింది భారత్.
ఇండిగో ‘డమ్ప్ లీజు’ ఒప్పందాన్ని ఆగస్టు 31, 2025 నాటికి రద్దు చేస్తామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తెలిపింది. ప్రస్తుతం, ఇండిగో టర్కిష్ ఎయిర్లైన్స్ నుంచి డంప్ లీజుకు రెండు బోయింగ్ 777-300ER విమానాలను తీసుకొని ఢిల్లీ, ముంబై నుంచి ఇస్తాంబుల్కు విమానాలను నడుపుతోంది. వాస్తవానికి ఈ లీజు గడువు మే 31న ముగియాల్సి ఉండగా, ఇండిగో అభ్యర్థన మేరకు డీజీసీఏ దానిని మరో మూడు నెలలు పొడిగించింది. ఈ లీజును 6 నెలలు పొడిగించాలని ఇండిగో కోరింది. కానీ DGCA దానిని తిరస్కరించింది. తదుపరి పొడిగింపు ఇవ్వబడదని, ఇది చివరి అవకాశం అని రెగ్యులేటర్ స్పష్టం చేసింది.