Tuesday, June 24, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంభూఖండానికి జ‌ల గండం

భూఖండానికి జ‌ల గండం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: వేసవి కాలమ‌న‌గానే అంద‌రికీ మండుటెండ‌లే గుర్తుకు వ‌స్తాయి. అందుకు భిన్నంగా భార‌త్‌లో ఈ వేసవి కాలంలో ఎండ‌ల తీవ్ర‌త కాస్తా త‌గ్గింది. నైరుతి ప‌వ‌నాలు ముందుగానే రావ‌డంతో..తీవ్ర‌మైన వ‌డ‌గాల్పుల నుంచి ఇండియా కాస్తా ఉప‌శ‌మ‌నం పొందింది. మ‌రోవైపు ప్ర‌పంచంలో భిన్న వాతావ‌ర‌ణ‌ ప‌రిస్థితులు తలెత్తాయి. అంత‌కంత‌కు ఎండ‌ల తీవ్రత‌ పెరిగి..గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్‌తో మంచు ప‌ర్వతాలు, హిమ‌ఖండాలు కొవ్వొత్తిలా క‌రిగిపోతున్నాయి.

ధృవ ప్రాంతాలైన అంటార్కిటికా, ఆర్కిటిక్ ప్రాంతాల్లో ఇటీవ‌ల శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న చేప‌ట్టి కీల‌క విష‌యాలు చెప్పారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు మంచు ఖండాల‌ను ప‌రిశీలించి ప‌లు వాస్త‌వాలను వెలుగులోకి తెచ్చారు. ఇప్పటికే 2 డిగ్రీల సెల్సియస్ వద్ద హిమానీనదం నీరుగా మారిపోయిందని, దీనిని వెంట‌నే నివారించే ప్ర‌యాత్నాలు ముమ్మ‌రం చేయాల‌ని, లేక‌పోతే పెను విధ్వంసం పొంచి ఉంద‌ని భూగోళ నిపుణులు హెచ్చ‌రించారు. గతంలో అంచనా వేసిన దానికంటే గ్లోబల్ వార్మింగ్ మరింత సున్నితంగా ఉంద‌ని వెల్లడించారు. ప్రపంచం 2.7 డిగ్రీల సెల్సియ‌స్ ల‌కు మించి వేడెక్కుతుంటే ప్రస్తుత హిమానీనదం 24% మాత్రమే మిగిలి ఉంద‌ని జర్నల్, సైన్స్ జర్నల్‌లో ప్రచురించబడిన ఓ తాజా అధ్య‌య‌నం పేర్కొంది. ఈ విప‌త్తుత్క‌ర ప‌రిస్థితులకు అంటార్కిటికా, గ్రీన్లాండ్ చుట్టూ ఉన్న మంచు ప‌ర్వ‌తాలు అధికంగా ప్ర‌భావిత‌మైవుతున్నాయ‌ని పేర్కొంది. ఈ ప‌రిణామాల‌ను నియంత్రించాలంటే గ్లోబెల్ వార్మింగ్‌ను 1.5 సెల్సియ‌స్ డిగ్రీల‌కు మించి ఉండ‌కూడ‌ద‌ని, అందుకు ప్ర‌పంచ దేశాలు ఐక్యంగా వాతావ‌ర‌ణ ర‌క్ష‌ణ‌కు న‌డుంబిగించాల‌ని, దీంతో 54శాతం హిమానీనదం ర‌క్షించ‌పడుతోంద‌ని శాస్త్ర‌వేత్త‌లు సూచిస్తున్నారు.

గ్లోబెల్ వార్మింగ్‌తో ఇండియాలోని హిందుకుస్ రేంజ్‌లోని మంచు ప‌ర్వ‌తాలు కూడా ప్ర‌భావిత‌మ‌వుతున్నాయి. అధిక ఉష్ణాగ్ర‌త‌ల కార‌ణంగా.. 2020 సంవ‌త్స‌రంలో అధిక‌శాతంలో మంచు క‌రిగిపోయి.. 25శాత‌మే హిమ‌నీన‌దం మిగిలి ఉంద‌ని.. ఇటీవలి ఖాట్మండుకు చెందిన ఐసిమోడ్ పరిశోధన అధ్యయనం పేర్కొంది. ఎవ‌రెస్టు ప‌ర్వ‌తంపై ఉన్న హిమ‌నీన‌దం కూడా నెమ్మ‌దిగా క‌రిగిపోతుంద‌ని, ఇదే ఇలాగే కొన‌సాగితే..భ‌విష్య‌త్‌లో ఎవ‌రెస్టు శిఖ‌రం కుశించే ప్ర‌మాదం ఉంద‌ని నేపాల్ దేశం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తుంది.

అంతేకాకుండా యూరోపియన్‌లోని ఆల్ఫ్, కెనడాలోని రాఖీ, ఐస్లాండ్‌లోని ప‌లు మంచు ప‌ర్వ‌తాలు కూడా క‌రిగిపోతున్నాయి. ఆయ ప‌ర్వతాల‌ శ్రేణిలో కూడా 10-15శాతం మాత్రమే మంచు ఉంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెపుతున్నారు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్‌తో ఈ మంచు విప‌రీతంగా క‌రిగిపోతుంద‌న్నారు. 2024లో వెనిజులా, హంబోల్ట్ ప్రాంతాల్లో అనుకున్న దానికంటే ఎక్కువ‌నే మంచు ప‌ర్వ‌తాల‌ను కోల్పోయ‌య్యాని, 2022లో జర్మనీ ఐదు హిమానీనదాలలో ఒకదాన్ని కోల్పోగా, స్లోవేనియా కొన్ని దశాబ్దాల క్రితం దాని చివరి నిజమైన హిమానీనదం కోల్పోయిందని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు.

దీంతో అప్ర‌మ‌త్త‌మైన ఐక్య‌రాజ్య‌స‌మితి.. మొట్టమొదటి గ్లోబల్ యుఎన్ సమావేశం శుక్రవారం తజికిస్తాన్‌లోని దుషన్‌బేలో నిర్వ‌హించింది. ఈ స‌మావేశానికి 50 కి పైగా దేశాల అధికారులు హాజ‌రైయ్యారు. రోజురోజుకు పెరుగుతున్న వాతావ‌ర‌ణ కాలుష్యంతో హిమ‌ప‌ర్వతాల‌పై పెను ప్ర‌భావం ప‌డుతుంద‌ని, అధిక ఉష్ట్రోగ‌త‌ల కార‌ణంగా శ‌ర‌వేగంగా మంచు ప‌ర్వ‌తాలు క‌రిగిపోతున్నాయ‌ని యూఎన్‌వో ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. వెంట‌నే హిమ‌నీన‌దాన్ని సంర‌క్షించుకోవాల‌ని, గ్లోబెల్ వార్మింగ్‌ను 1.5శాతానికి ప‌రిమితం చేయాల‌ని ప్ర‌పంచ‌దేశాల‌కు పిలుపునిచ్చింది. ఈ ప‌రిణామంపై ప్ర‌పంచ దేశాలు మేలుకోక‌పోతే ఆర్కిటిక్ నుండి అండీస్ వరకు, ఆల్ప్స్ నుండి హిమాలయాల వరకు మంచు ప‌ర్వ‌తాలు క‌రిగిపోయి..భూ ఖండం జ‌ల‌స‌మాధి కాబోతుంద‌ని హెచ్చ‌రించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -