- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బిట్కాయిన్ స్కామ్ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు ముంబైలోని ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తోంది. ఈడీ దాఖలు చేసిన చార్జ్షీట్ను కోర్టు గుర్తించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. రాజ్ కుంద్రాతో పాటు దుబాయ్లో ఉండే మరో వ్యాపారవేత్త రాజేశ్ సతీజాకు కూడా సమన్లు పంపారు. వీరిద్దరూ జనవరి 19న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
- Advertisement -



