- Advertisement -
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ : నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా కళాశాలలో కల్చర్ నోవా -2026 పేరిట వార్షిక సాంస్కృతిక క్రీడోత్సవాలు జరిగాయి. ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రాముఖర్జీ రిబ్బ ను కత్తిరించి ప్రారంభించారు. మెహందీ, రంగోలి, పెయింటింగ్, హెయిర్టెల్, పాటలు వంటి విభాగాలలో జరిగిన పోటీలలో 80 మంది విద్యా ర్థినులు ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొన్నారు. హైదరాబాద్ వంటకాల సంస్కృ తిని సూచించే వివిధ రకాల వంటకాలను విద్యార్థినులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక సమన్వయకర్త డాక్టర్ భగవతి, వైస్ ప్రిన్సిపల్ శ్రీదేవి, డాక్టర్ ఏషియన్ జబీన్, ఐకాక్ సమన్వయకర్త అంచల్, విద్యార్థినులు పాల్గొన్నారు
- Advertisement -



