– ఎమ్మార్పీఎస్రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేశ్మాదిగ
నవతెలంగాణ-నార్కట్పల్లి :78 ఏండ్ల స్వాతంత్య్ర భారతదేశంలో 30 ఏండ్లుగా సజీవంగా నిలబడి లక్ష్యాన్ని ముద్దాడిన ఏకైక సామాజిక ఉద్యమం ఎమ్మార్పీఎస్ మాత్రమే అని, ఈ 30 ఏండ్ల కాలంలో దండోరా జెండా సమస్త పీడిత అణగారిన వర్గాలకు అండగా నిలిచిందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ, మాదిగ జర్నలిస్టుల ఫోరం( ఎంజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు గాదె రమేష్ మాదిగలు అన్నారు. నార్కట్పల్లి మండలకేంద్రంలోని ఎస్సీ కాలనీలో దండోరా జెండా గద్దె నిర్మాణపనులకు వారు శంకస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నార్కట్పల్లి టౌన్ అధ్యక్షుడు మంద సుధాకర్ మాదిగ ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించారు. అనంతరం నిర్వహించిన ఎమ్మార్పీఎస్ పట్టణ సదస్సులో వారు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఆవిర్భవించిన తరువాత, మంద కష్ణ తన పేరు పక్కన మాదిగ అని చేర్చుకున్న తరువాత మాదిగ సమాజానికి ఎనలేని దైర్యం కలిగిందన్నారు. ఆ దైర్యంతోనే మాదిగలంతా తమ పేరు పక్కన కులం పేరు చేర్చుకొని ఆత్మ గౌరవాన్ని చాటుకున్నారని తెలిపారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన అందక పోవడం వల్లనే మాదిగలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారన్నారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించాలని మంద కష్ణ మాదిగ నేతత్వంలో 30ఏండ్లు రాజీలేని పోరాటం సాగిందని అన్నారు. ఆ పోరాట ఫలితంగానే నేడు తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చట్టం అమలులోకి వచ్చిందని, దాని ద్వారా మాదిగలకు 9శాతం రిజర్వేషన్లు దక్కాయన్నారు.ఈ నేపథ్యంలో జూలై 7న ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రతి గ్రామంలో దండోరా జెండా ఆవిష్కరణలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు ఇరిగి శ్రీశైలంమాదిగ, ఎమ్మార్పీఎస్ మొదటితరం నేతలు మందరాములుమాదిగ, చిరుమర్తి యాదయ్యమాదిగ, మారయ్య మాదిగ, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు కొమిరె స్వామిమాదిగ,నార్కట్పల్లి మండలఇన్చార్జి ఎరసాని గోపాల్ మాదిగ, ఎన్ ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు బన్ని మాదిగ పాల్గొన్నారు.
దండోరా జెండా అణగారిన వర్గాలకు అండ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES