నవతెలంగాణ-హైదరాబాద్: ఐపీఎల్ సీజన్-18 తుది సమరానికి వేళైంది. కాసేపట్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ వర్సెస్ కింగ్స్ లెవన్ పంజాబ్ జట్ల మధ్య తుది పోరులో ఆమీతుమీ తెల్చుకోనున్నాయి. గుజరాత్లో అహ్మాదాబాద్ స్టేడియం వేదికగా జరిగే పైనల్ పోరులో కొత్త చాంపియన్ ఎవర్నేది కొన్ని గంటల్లో తేలనుంది. ఇప్పటికే ప్లే ఆప్ మ్యాచ్ ల్లో ఇరుజట్లు విజయం కైవసం చేసుకొని టైటిల్ అందుకోవడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాయి.
ఇప్పటి వరకు జరిగినా మ్యాచ్లన్ని ఒక ఎత్తు..ఇవాళ జరిగే మ్యాచ్ మరొ ఎత్తు. లీగ్ దశలో రెండు జట్లు కూడా అద్భుతమైన ఆటతీరుతో విక్టరీ సాధించాయి. క్వాలిఫయిర్-1, 2 మ్యాచ్ల్లో రెండు జట్టు కూడా ఉత్తమ ఆటతీరును కనబర్బి ఫైనల్ పోరుకు సిద్ధమైయ్యాయి. క్వాలిఫయిర్-1 మ్యాచ్లో కింగ్స్ లెవన్ పంజాబ్ను ఆర్సీబీ ఓడించి నేరుగా ఫైనల్ కు చేరింది. అయితే సెకండ్ క్వాలిపయిర్లో పంజాబ్ కింగ్స్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. గుజరాత్ టైటాన్స్ ను ఓడించిన ముంబాయి జట్టుకు ఓటమి రుచి చూపించింది శ్రేయాస్సు అయ్యారు టీం. టీం సమిష్టి కృషితో, శ్రేయేస్సు అయ్యార్ కెప్టన్ ఇన్నింగ్స్ తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఇవాళ జరిగే ఫైనల్ ఫైట్లో విజేత లెవరో కాసేపట్లో తెలనున్నారు. ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైన..బుధవారం రీషెడ్యూల్ చేయనున్నారు. అయినా కానీ మ్యాచ్ కు వానా గండముంటే..పాయింట్ పట్టికలో ప్రథమ(పంజాబ్) స్థానంలో జట్టును విజేతగా ప్రకటించనున్నారు.
మరోవైపు కాసేపట్లో ప్రారంభం కానున్న ఫైనల్ పోరును చూసేందుకు ఐపీఎల్ అభిమానులు అహ్మదాబాద్ స్టేడియానికి బారులు తీరారు. ఇరు జట్లు అభిమానులు తమ జట్టు ప్లేయర్లను ఉత్సహ పరిచేందుకు..ఆయా టీంల జెర్సీల తో స్టేడియంలోకి తరలిస్తున్నారు. అంతేకాకుండా తుది పోరును తిలకించేందుకు సినీతారలు, రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్తలు వస్తున్నారు. అదేవిధంగా భద్రత పరంగా గుజరాత్ ప్రభుత్వం పకడ్బందీగా బందోబస్తు కల్పించింది. స్టేడియం లోపల, బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నిఘా పెంచారు. స్టేడియంలోకి వచ్చే ప్రతి ప్రేక్షకుని కుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు అధికారులు.