Saturday, June 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దేశ భవిష్యత్తు విద్యార్థులపైనే ఆధారపడి ఉంది

దేశ భవిష్యత్తు విద్యార్థులపైనే ఆధారపడి ఉంది

- Advertisement -

నవతెలంగాణ – ధర్మసాగర్
ఈ దేశ భవిష్యత్తు విద్యార్థులపైనే ఆధారపడి ఉంటుందని ధర్మ ప్రకాష్ మండల కేంద్రంలో బడిబాట గ్రామసభ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఇన్చార్జి ధర్మ ప్రకాష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలల,ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, గ్రామంలోని 10 సెంటర్ల అంగన్వాడి ఉపాధ్యాయులు ,స్వయం సహాయక బృందాల బాధ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మసాగర్ గ్రామంలోని అన్ని వార్డులలో గల బడి ఈడు పిల్లలను గుర్తించి రెండున్నర సంవత్సరాల నుండి ఐదేళ్ల లోపు పిల్లలని వారి ఇంటి సమీపాన గల అంగన్వాడి కేంద్రంలో చేర్పించాలన్నారు.,ఐదు నుండి తొమ్మిది సంవత్సరాల పిల్లల్ని వారి ఇంటి దగ్గరలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ,10 నుండి 15 సంవత్సరాల పిల్లల్ని వారి ఇంటికి దగ్గరలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేర్పించేందుకు ప్రతి తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా 15 సంవత్సరాలపై చిలుకు ఉన్న డ్రాప్ అవుట్ పిల్లల్ని మండల కేంద్రంలోని ఓపెన్ స్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేర్చి చదువుకునేలా ప్రోత్సహించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంగళ మురళి, స్థానిక అంగన్వాడి ఆశ కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -