– బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుందాం
– బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ సర్పంచ్ డా చిర్ర యాకాంతం గౌడ్
నవతెలంగాణ నెల్లికుదురు : స్వచ్ఛ బ్రాహ్మణ కొత్తపల్లి నిర్మాణం పూర్తి చేసుకుని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామాన్ని తీర్చి దిద్దుకుందామని ఆ గ్రామ సర్పంచ్ డాక్టర్ చిర యాకాంతం గౌడ్ తెలిపాడు. గ్రామంలోని బుధవారం వీధులు ప్రక్కల ముళ్ళపదలను తొలగిస్తూ రోడ్లను శుభ్రపరుస్తూ సైడ్ కాలువల్ల కూడికతీత కార్యక్రమాలను తీసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాన్నిఅన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి గ్రామంలోని ప్రతి వాడలో ఎలాంటి సమస్య లేకుండా తీర్చి దిద్ది పెడతామని అన్నారు. ఎన్నికల్లో అఖండ విజయం కట్టబెట్టిన గ్రామ ప్రజలకు సాధ్యమైనంత వరకు సేవ చేస్తానని నెలరోజుల కాలంలోనే నల్లాల మరమ్మత్తు తో పాటు పైపులైను లీకేజీలు సరిచేశామని సైడ్ కాల్వల్లో పూడిక తీత పనులు జరిగాయాన్నారు .ప్రస్తుతం గ్రామాన్ని స్వచ్ఛమైన గ్రామంగా చేయడంలో నిమగ్న మయ్యామని గ్రామస్తులందరి సహకారం తో యువత, మహిళలు పెద్దఎత్తున పాల్గొని అంతర్గత రోడ్ల పక్కన కంపలు, గడ్డి, మట్టిని తొలగించడం జరుగుతుంది అన్నారు. రానున్న 5 సంవత్సరాల్లో గ్రామాన్ని రాష్ట్ర స్థాయిలో నిలుపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజలు హర్ష వ్యక్తం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో పార్టీ అధ్యక్షలు బొల్లు మురళి, వార్డు సభ్యులు జెల్ల పర్శరాములు, బొమ్మేనబోయిన స్వరూప వీరన్న, పిడుగు అనంత యాదగిరి గ్రామస్తులు యువత పాల్గొన్నారు
స్వచ్ఛ బ్రాహ్మణ కొత్తపల్లి నిర్మాణమే లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



