Sunday, June 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్నికల హామీలను విస్మరించిన ప్రభుత్వం..

ఎన్నికల హామీలను విస్మరించిన ప్రభుత్వం..

- Advertisement -

నవతెలంగాణ – తాడ్వాయి 
అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, ఇందిరమ్మ ఇడ్ల పంపిణీలు అక్రమాలను అరికట్టాలని బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి, మాజీ జెడ్పి చైర్ పర్సన్ బడే నాగజ్యోతి, మాజీ జెడ్పిటిసి రామసహాయం శ్రీనివాస్ రెడ్డి లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాటాపుర్ గ్రామంలో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు  కేటాయించాలని పార్టీ శ్రేణులతో కలిసి బడే నాగజ్యోతి, మాజీ జెడ్పిటిసి రామ సహాయం శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు దండగల మల్లయ్య, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా బడే నాగజ్యోతి, శ్రీనివాస్ రెడ్డి లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని వారు ప్రభుత్వం పై మండిపడ్డారు. ములుగు జిల్లాలలో ఇందిరమ్మ ఇండ్ల పేరిట కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. 2023 లో బిఆర్ఎస్ ప్రభుత్వంలో  కాటాపుర్ గ్రామంలో 108 మందికి భూమిలేని నిరుపేద కుటుంబాలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశామని, కొన్ని రోజుల  తర్వాత  ఎన్నికలు రావడంతో  అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇండ్ల పట్టాల లబ్ధిదారులను అధికారులు జాప్యం చేయడంతో  అక్కడి ఎమ్మార్వోను కలెక్టర్ లను కలిసి వినతి పత్రం అందించిన కూడా ఇండ్లపట్టాలు ఇవ్వకపోవడం  బాధాకరమైన విషయమని అన్నారు.

ఇప్పటికైనా ఇండ్ల పట్టాల లబ్ధిదారులపై స్పందించకపోతే జిల్లా కలెక్టరేట్ ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. మేడారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమ ఇసుక దందాను నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. నిత్యం మేడారం సమ్మక్క సారలమ్మ ను దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు తరలివస్తావుంటే ఇంచార్జి ఎమ్మార్వోలు నియమించడం ఏమిటని బడే నాగజ్యోతి ప్రశ్నించారు. అదేవిధంగా అడవినే నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న ఆదివాసుల గుడిసెలను ఫారెస్ట్ అధికారులు తొలగించడం బాధాకరమైన విషయం అని అన్నారు. చల్పాక గ్రామంలో ఆదివాసులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని లేనిపక్షంలో జిల్లా కలెక్టరేట్ ముందు  భారీ ఎత్తున ధర్నా రాస్తారోకో నిర్వహిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రామసహాయం  శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు దండగుల మల్లయ్య, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మండల అధ్యక్షులు దిడ్డి మోహన్ రావు, నాయకులు నుశెట్టి రమేష్, పోగు నగేష్, ఇంద్రారపు లాలయ్య, సాయిరి లక్ష్మీనర్సు, దానక నర్సింగరావు, బందెల తిరుపతి, తిరుపతి, రంగు సత్యం, ఎండి రఫిక్, కొండూరి నరేష్, గండు బిక్షపతి, మాజీ సర్పంచ్ జాజ చంద్రం, పుల్లూరి గౌరమ్మ, రామిండ్ల పెద్ద లాలయ్య, మహేశ్వర చారి, మహిళలు, ఇండ్లు రాని వారు తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -