Saturday, May 31, 2025
E-PAPER
Homeజిల్లాలుధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి 

ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి 

- Advertisement -

జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ 

నవతెలంగాణ-భూపాలపల్లి

దాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు.గురువారం తన ఛాంబర్‌లో పౌర సరఫరాలు, డిఎం,  జిల్లాలోని అన్ని బాయిల్డ్ రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్రాలలో నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు  రవాణాను వేగవంతం చేయాలని సూచించారు. మిల్లర్లు దాన్యం దిగుమతి కొరకు హమాలీలను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.  అలాగే ధాన్యం స్వీకరించినట్లు మిల్లర్లు ఇవ్వాల్సిన అంగీకార పత్రాలను వెంటనే అందజేయాలని తెలిపారు. అధికారులు నిరంతరం మిల్లులు తనిఖీ చేస్తూ  ధాన్యం మిల్లింగ్ ప్రక్రియలో వేగం పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారును ఆదేశించారు . 

ఈ సమావేశంలో  పౌర సరఫరాల అధికారి శ్రీనాధ్, డిఎం రాములు,  రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -