– జీడి పల్లి లత నరసింహ రెడ్డి దంపతులు
నవతెలంగాణ-కామారెడ్డి : పాల్వంచ మండలంలోని ఫరీద్ పేట గ్రామంలో జీడి పల్లి లత నరసింహ రెడ్డి దంపతులు తమ కూతురు హరిక,తండ్రి మహబూబ రెడ్డి ల జ్ఞాపకార్ధం తమ స్వంత నిధులు 20 లక్షలతో అత్యాధునిక హంగులతో గ్రంథాలయ భవనాన్ని నిర్మించారు. బుధవారం గ్రామలోని ఉద్యోగులు, యువత, గ్రామప్రజల సమక్షంలో గ్రంధాలయం ను గ్రామానికి అంకితం ఇవ్వడం జరిగినదన్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ జీడి పల్లి లత నరసింహారెడ్డి దంపతులు తమ స్వంత నిధులతో నిర్మించడం ఆదర్శనీయం అని, గ్రంథాలయ నిర్మాణము చేయడము అంటే గ్రామాన్ని చైతన్యము వైపు పరుగులు పెట్టించడం ఉందని, ఆ కుటుంబానికి గ్రామ ప్రజలు, ఉద్యోగులు, యువత తరపున కృతజ్ఞతలు ,ఈ గ్రామము మీకు ఎల్లవేళల రుణ పడి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంగల వెంకటి, గ్రామస్తులు బట్టెంకి బాలరాజ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
గ్రంధాలయం గ్రామ యువతకి అంకితం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



