- Advertisement -
నవతెలంగాణ-సంగెం : వరంగల్ జిల్లాలో తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. సంగెo మండలంలో ఓ కొడుకు కన్నతల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వివరాల్లోకి వెళితే. మండలంలోని కుంటపల్లి గ్రామానికి చెందిన వినోద(50)పై ఆమె కొడుకు పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. గమనించిన స్థానికులు మంటలు అర్పి ఆస్పత్రికి తరలించారు . 80 శాతం కాలిన గాయాలతో తల్లి వినోద ఎంజీఎం ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. నిప్పు అంటించిన కొడుకు అక్కడి నుంచి పరారయ్యాడు.
- Advertisement -