Tuesday, June 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపాలు విరిగిపోయాయి… పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు

పాలు విరిగిపోయాయి… పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో అరుదైన ఫిర్యాదు ఒకటి వెలుగుచూసింది. తాము కొనుగోలు చేసిన పాలు విరిగిపోయాయని కొందరు వినియోగదారులు పోలీసులను ఆశ్రయించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నదీప్ సూపర్ మార్కెట్‌లో కొంతమంది వినియోగదారులు పాల ప్యాకెట్లను కొనుగోలు చేశారు.

ఇంటికి తీసుకెళ్లి మొదటి పాల ప్యాకెట్‌ను కాచినప్పుడు పాలు బాగానే ఉన్నాయని, అయితే రెండో ప్యాకెట్‌ను వేడి చేయగా అవి పూర్తిగా విరిగిపోయాయని బాధితులు తెలిపారు. ఈ విషయంపై సూపర్ మార్కెట్ సిబ్బందిని ప్రశ్నించగా, వారు బాధ్యత వహించలేమని చెప్పడంతో వినియోగదారులు అసంతృప్తికి గురయ్యారు. దీంతో వారు నేరుగా కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన కూకట్‌పల్లి పోలీసులు, వినియోగదారుల పరిరక్షణ చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -