Monday, June 2, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅందాల కీరిటం ఎవ‌రికిద‌క్కెనో..?

అందాల కీరిటం ఎవ‌రికిద‌క్కెనో..?

- Advertisement -
  • కాసేప‌ట్లో ప్రారంభంకానున్న మిస్ వ‌ర‌ల్డ్ గ్రాండ్ ఫినాలే

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన మిస్ వ‌ర‌ల్డ్ పోటీలు తుది ఆంఖానికి వేళైంది. కాసేప‌ట్లో హైటెక్స్ వేదికగా సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రారంభం కానున్న ఫినాలేకు స‌ర్వం సిద్ధ‌మైంది. రాష్ట్ర టూరిజం శాఖ, మిస్ వరల్డ్‌ ఆర్గనైజేషన్ భారీ ఏర్పాట్లు చేసింది. గ్రాండ్ ఫినాలేకి 3,500 మంది గెస్ట్‌లుగా హాజరుకానున్నారు. గ్రాండ్ ఫినాలేకి టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు రానున్నారు. 2017 మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ ప్రత్యేక అతిథిగా రానున్నారు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు.

2016 మిస్ వరల్డ్ విన్నర్ స్టేఫినీ డెల్ వాలే, సచిన్ కుంభర్‌.. ఫినాలే ఈవెంట్‌ను హోస్ట్ చేయనున్నారు. బాలీవుడ్ తార జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ కట్టర్ స్పెషల్ లైవ్ షో నిర్వహించనున్నారు. మిస్ వరల్డ్ న్యాయనిర్ణేతలుగా నటుడు సోను సూద్, సుధారెడ్డి, 2014 మిస్ ఇంగ్లాండ్ కరీనా టర్రెల్ వ్యవహరించనున్నారు. ఫినాలేలో మిస్ వరల్డ్ హ్యూమానిటరియన్ అవార్డును సోనుసూద్‌ అందుకోనున్నారు. మిస్ వరల్డ్ చైర్ పర్సన్ జూలియా మోర్లీ.. విన్నర్‌ను ప్రకటించనున్నారు. 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా.. విజేతకు 6.21 కోట్ల విలువ గల బ్లూ క్రౌన్ అలంకరించనున్నారు. విశ్వసుందరికి 8.5 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది. 40 మంది సుందరీమణులు ఫినాలేలో పోటీపడనున్నారు. టాప్ 40లో ఇప్పటికే 16 బెర్త్‌లు ఖరారు కాగా, ఈ రోజు జరిగే క్వార్టర్స్ ఫైనల్స్‌లో 24 మందిని జూరీ మెంబర్లు ఎంపిక చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -