ఎగిరేది గులాబీ జెండానే..

– నల్లగొండ,భువనగిరి లో బిఆర్ఎస్  అభ్యర్ధుల విజయం తథ్యం 
– కాంగ్రెస్ , బీజేపీ వైఫల్యాలను ప్రజలు ఎండగడుతున్న వైనమే దీనికి నిదర్శనం 
– ప్రచారంలో బిఆర్ఎస్ శ్రేణులకు ప్రజల నుండి అపూర్వ స్పందన
– కేసీఆర్ ని వదులుకొని తప్పు చేశామనే భావన ప్రజల్లో ఉంది 
– కొత్త పథకాలు ఇవ్వక పోగా కేసీఆర్ ఇచ్చినవి కొనసాగించలేని అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్ 
– ప్రజలకు ఉపయోగపడే పనులు పక్కన పెట్టి ప్రజలకు  సంబంధం లేని అంశాలతో కాంగ్రెస్ బీజేపీ నాటకాలు
– కాంగ్రెస్ బీజేపీ నాటకాలను తెలంగాణ ప్రజలు పసిగట్టారు
– ప్రచార హోరు.. గులాబీ జోరు 
– విస్తృతంగా గులాబీ శ్రేణుల క్యాంపెయిన్‌
– చివ్వెంల మండలం పాచ్యానాయక్ తండా ఇంటింటి ప్రచారం నిర్వహించిన మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి
– బీఆర్‌ఎస్‌ పథకాలు.. కాంగ్రెస్‌, బీజేపీ వైఫల్యాల వివరణ..
– ప్రజల నుంచి విశేష స్పందన
 నవతెలంగాణ – చివ్వేంల
ఉమ్మడి నల్లగొండ లోని నల్లగొండ, భువనగిరి రెండు లోక్ సభ స్థానాల్లో ఎగిరెది గులాబి జెండా నే అని  మాజీ మంత్రి,సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట నియోజకవర్గంలోని చివ్వెంల మండలం పాచ్యా నాయక్ తండా లో నల్లగొండ లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్న బిఆర్ఎస్ అభ్యర్ధి కంచర్ల కృష్ణారెడ్డి కి  మద్దతుగా పార్టి శ్రేణుల తో కలిసి గడప గడప కు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా మీడియా తో మాట్లాడిన జగదీష్ రెడ్డి, ప్రచారంలో బిఆర్ఎస్ శ్రేణులకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోందనినల్లగొండ, భువనగిరి లో బిఆర్ఎస్  అభ్యర్ధుల విజయం తథ్యం  అన్నారు. ప్రచారానికి వెళ్లిన తమ  నాయకులను కలుస్తున్న సబ్బండ వర్గాలు కాంగ్రెస్, బిజేపీ వైఫల్యాలను  ఎండగడుతున్న వైనమే దీనికి నిదర్శనం  అన్నారు.కెసిఆర్ ని వదులుకొని తప్పు చేశామనే భావన ప్రజల్లో ఉందన్నారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలకు మోసపోయి  కల్యాణ లక్ష్మీ పధకం ద్వారా లక్ష రూపాయల కు తోడు తులం బంగారం, రైతు రుణ మాఫీ, వంటి మోసపూరిత వాగ్దానాలకు మోసపోయామని  ప్రజలు వాపోతున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పథకాలు ఇవ్వక పోగా కేసీఆర్ ఇచ్చినవి కొనసాగించలేని అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు పక్కన పెట్టి ప్రజలకు  సంబంధం లేని అంశాలతో కాంగ్రెస్ బీజేపీ నాటకాలు ఆడుతున్నాయని,కాంగ్రెస్ బీజేపీ నాటకాలను తెలంగాణ ప్రజలు పసిగట్టారని అన్నారు.
పాలేందో ..నీళ్ళేందో ప్రజలకు స్పష్టంగా అర్థమైందన్నారు. మరోసారి కాంగ్రెస్‌ ను నమ్మితే మరిన్ని కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అనే భావనలో ప్రజలు ఉన్నారని తెలిపారు. ఇచ్చిన హామీలను విస్మరించిన హస్తం పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష అన్న జగదీష్ రెడ్డి, బీఆర్‌ఎస్‌ హయాంలో పథకాలు అందని ఇల్లు లేదన్నారు.  ప్రచారంలో కాంగ్రెస్ బిజెపిలను వెనక్కి నెట్టి బిఆర్ఎస్ శ్రేణులు కథం తొక్కుతుండటం తో జిల్లాలో గులాబీ జోరు కొనసాగుతుంది.  ప్రచార కార్యక్రమంలో ఎంపీపీ కుమారి బాబు నాయక్, జడ్పిటిసి సంజీవ నాయక్, బి ఆర్ ఎస్ పార్టీ మండల  అధ్యక్షులు జూలకంటి జీవన్ రెడ్డి, సీనియర్ నాయకులు రౌతు నరసింహారావు, మాజీ మార్కెట్ డైరెక్టర్ ఉట్కూరి సైదులు, రావి చెట్టు సత్యం, గోవిందరెడ్డి, భూక్య నాగు నాయక్,  అనిల్ నాయక్, బాలాజీ నాయక్, రత్నావత్ నాగరాజు, దస్తగిరి,రాజేష్ నాయక్,  బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love