– ఫోన్ ట్యాపింగ్పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం : బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ పోలీసులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలను పాటించి ప్రభుత్వ కుట్రల్లో పావులుగా మారొద్దని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు. ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ విషయంలో సీఎం బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో అంతర్గత శాంతిభద్రతలకు భంగం కలిగే ప్రమాదముందని హెచ్చరించారు. ట్యాపింగ్ కేసును సిట్ అధికారులు విచారణ చేస్తున్నారా? గాంధీ భవన్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు విచారణ చేస్తున్నారా? తెలియని పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. పోలీసులకు తెలియని విషయాలు ముందుగా వారికెలా తెలుస్తున్నాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చే చవకబారు లీకుల ఆధారంగా బీఆర్ఎస్ నేతలపై మీడియా దుష్ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. అభిమాన నాయకులపై ఫేక్ ప్రచారాలు చేయడాన్ని తట్టుకోలేక ప్రజలు దాడి చేశారనీ, దానికి ప్రభుత్వమే కారణమని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశం పూర్తిగా పోలీసు శాఖకు సంబంధించిన విషయమనీ, రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన బీఆర్ఎస్వీ నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ కుట్రలో పోలీసులు పావులు కావొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES