Friday, May 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలువైద్య ఆరోగ్య శాఖలో ఫార్మసీ ఆఫీసర్స్ పాత్ర కీలకం

వైద్య ఆరోగ్య శాఖలో ఫార్మసీ ఆఫీసర్స్ పాత్ర కీలకం

- Advertisement -

– డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డా. బి. రవీంద్ర నాయక్.
– డి.హెచ్ కు రాష్ట్ర ఫార్మసీ ఆఫీసర్స్ అధ్యక్షులు బత్తిని సుదర్శన్ గౌడ్ కృతజ్ఞతలు.

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్ : తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బత్తిని సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ బి రవీంద్రనాయక్ ని మర్యాద పూర్వకంగా కలిసి ఫార్మసీ ఆఫీసర్ రావడానికి సహకరించినందులకు కృతజ్ఞతా పూర్వకముగా పూల భోకే, శాలువా, స్వీట్స్, మెమొంటో లతో ఘనంగా సన్మానం చేశారు.
ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు బత్తిని సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో ఫార్మసీ ఆక్ట్ 1948,,సెక్షన్ 42 అమలు చేయాలని ఈ క్రింది ప్రధాన సమస్యలు పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేసారు.
ఫార్మసిస్ట్స్ ప్రధాన సమస్యలు:
1.భస్తీ ధవఖానాల్లో ఫార్మసిస్ట్ లను నియమించాలి.
2.పల్లె ధవా ఖానాల్లో ఫార్మసిస్ట్ లను నియమించాలి.
3.ప్రతి జిల్లా లో డి వి ఎల్ యం లలో ఫార్మసిస్ట్ గ్రేడ్ 1 లను నియమించాలి.
4. ప్రతి జిల్లా డి.యం.హెచ్.ఓ ఫార్మసీ స్టోర్స్ లో రెగ్యులర్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 మరియు గ్రేడ్ 1 పోస్ట్ లు మంజూరు చేయాలి.
5. ప్రతి జిల్లా టీచింగ్ ఆసుపత్రు లలో ఫార్మసిస్ట్ గ్రేడ్ 1 రెండు పోస్టులు,మరియు ఫార్మసీ సూపరవైజర్స్ రెండు పోస్ట్ లు, మరియు ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 లు పన్నెండు పోస్ట్ లు మంజూరు చేయాలి.
6. ప్రతి PHC లో ముగ్గురు ఫార్మసిస్ట్స్ లను నియమించాలి
7.ఫార్మసీ సూపర్ వైజర్ పోస్ట్స్ అన్ని జిల్లాల్లో ని టీచింగ్ ఆసుపత్రులలో కాళీ గా ఉన్నాయి.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వము ఇచ్చిన సర్కులర్ ప్రకారం 13సం. లు సర్వీస్ పూర్తి చేసిన ఫార్మసిస్ట్ లకు సీనియారిటీ ప్రకారం ఖాళీ గా ఫార్మసీ సూపర్ వైజర్ పోస్ట్ లలో నియమించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్బంగా డైరెక్టర్ గారు మాట్లాడు చూ ఫార్మసిస్ట్ లకు ఫార్మసీ ఆఫీసర్ గా పేరు మారుస్తూ ప్రభుత్వం జీ ఓ ఇవ్వడం సంతోషంగా ఉందని,
ఫార్మసిస్ట్ ల సమస్యలు అన్నింటిని త్వరలోనే పరిష్కారం చేస్థానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ జాలిగామ అశోక్, వర్కింగ్ ప్రెసిడెంట్ కంద కట్ల శరత్ బాబు,కోశాధికారి యాదయ్య, గౌరవ అధ్యక్షులు వేణు గోపాల్ రెడ్డి, పరబ్ కుమార్,మహేష్, అడ్వాజర్ ముత్తార్ మోహినూద్దీన్, అహ్మదుల్లా ఖాన్,రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉదయ్ ప్రసాద్,ఖలీల్ హుస్సేన్, శ్రీధర్ రెడ్డి, అలీ,జాయింట్ సెక్రటరీలు చంద్రయ్య, దుర్గం అఖిల్,శ్రీశైలం,హన్మకొండ జిల్లా అధ్యక్షులు వంగ సుధాకర్ రెడ్డి, వరంగల్ జిల్లా సెక్రటరీ యం అవినాష్,రాజేందర్, అరుణ జ్యోతి, పద్మజ, పార్వతి,అజయ్ కుమార్, రాఘవేందర్, రాబర్ట్ బ్రూస్, శ్రీనివాస్, రాధిక అలేఖ్య, పద్మజ, వనిత, కళ్యాణ్, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

    - Advertisement -
    RELATED ARTICLES
    - Advertisment -

    తాజా వార్తలు

    - Advertisment -