- Advertisement -
నవతెలంగాణ – రుద్రంగి: పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని రుద్రంగి ఎస్ఐ బి.శ్రీనివాస్ అన్నారు.పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీస్ వారి ఆధ్వర్యంలో రుద్రంగి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి ఇందిరా చౌక్ వరకు విద్యార్థులతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివాని, వారి త్యాగం సమాజం ఎప్పటికి మారువడాని అన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్, కానిస్టేబుల్ రవి, రజినీకాంత్, సంతు, రామకృష్ణ, మధు, మారుతి, శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, వ్యాయమ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- Advertisement -



