పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివి 

– పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివి
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
పోలీస్ అమరవీరులు చేసిన త్యాగాలు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయని , అమరుల త్యాగాలు మరువలేని అని హుస్నాబాద్ ఏసిపి సతీష్ అన్నారు. శనివారం హుస్నాబాద్ సర్కిల్ కార్యాలయం ఎదుట పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఎస్సై జాన్ విల్సన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీసులు విధి నిర్వహణలో ప్రజలతో మమేకమై గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ సిఐ ఎర్రల కిరణ్, హుస్నాబాద్ ఎస్సై తోట మహేష్, ఏఎస్ఐ లు మణెమ్మ, సురేందర్ రెడ్డి పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love