నవతెలంగాణ – దుబ్బాక
“బడి మనదే – ఊరు మనదే” అన్నదే తమ నినాదమని, టీచర్ల హక్కుల కోసమే కాదు.. సామాజిక బాధ్యతగా స్టూడెంట్స్ కోసమూ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) కృషి చేస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ వలీ అహ్మద్ అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వెచ్చించి విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థికంగా నష్టపోతున్నారని, అదే ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదును పెంచాలన్న సామాజిక బాధ్యతతో టీఎస్ యూటీఎఫ్ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ప్రచార జాత’ను పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, డీఈఓ శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించగా.. బుధవారం దుబ్బాకకు చేరుకుంది. ఈ ప్రచార జాత వాహనానికి ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా షేక్ వలి అహ్మద్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుంటేనే భవిష్యత్తులో అంతరాలు లేని సమాజం నిర్మితమవుతుందన్నారు. కరోనా లాక్ డౌన్ వంటి కష్ట సమయంలో ప్రైవేట్ పాఠశాలలు చేతులెత్తాని, అప్పుడు మనందరికీ ప్రభుత్వ బడులు, ప్రభుత్వ వైద్యమే అండగా నిలిచిందని గుర్తు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించాలని, తమ పిల్లలను సర్కార్ బడుల్లోనే చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తపెట్ల యాదగిరి, రాష్ట్ర కమిటీ సభ్యులు జీ.వెంకట కిరణ్, జిల్లా కోశాధికారి ఎం.కృష్ణ, కార్యదర్శి సీహెచ్.రామచంద్రం, కమిటీ సభ్యులు సీహెచ్.కృష్ణ, డీ.నర్సింలు, ఎన్.యాదగిరి, జే.నర్సింలు, విద్యార్థుల తల్లిదండ్రులు జీ.భాస్కర్, బోడ చందు, నర్సింలు, కొంపల్లి భాస్కర్, ఎండీ.సాజిద్, పలువురు పాల్గొన్నారు
“బడి మనదే – ఊరు మనదే”
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES