- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
పాలిసెట్ 2025 ఫలితాలలో రాష్ట్రస్థాయిలో 29 వ ర్యాంకు సాధించిన తోటకూర వైష్ణవిని బుధవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ తోటకూర యాదయ్య మాట్లాడుతూ అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ డిప్లమా కళాశాలలో ప్రవేశాల కోసం రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పాలీసెట్ ఫలితాలలో రాష్ట్రస్థాయిలో ఎంబైపిసి విభాగం లో 29వ ర్యాంకు సాధించిన శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ హైస్కూల్ విద్యార్థి వైష్ణవిని అభినందించారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను చేరాలని కోరారు.
- Advertisement -