- Advertisement -
నవతెలంగాణ-మణుగూరు:సంక్షేమ అధికారులు అందించే సేవలు మరువలేనివి అని ఏరియా టీబీజీకేఎస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్ 2లో విధులు నిర్వహిస్తున్న సీనియర్ పీఓ అధికారి ఓంకారి బాపు శ్రీరాంపూర్ ఏరియాకు బదిలీ పై వెళుతున్న సందర్భంగా ఆదివారం నాగెల్లి నేతృత్వంలో శాలువాతో సత్కరించి పూల మొక్క అందించి, మిఠాయి ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బంగారి పవన్ కుమార్, మస్తాన్, మడ్డి రాము, పడ్డం శ్రీనివాస్, రమేష్, గఫూర్, బిక్షపతి, ఇమ్రాన్, కల్యాణ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -