విష్ణు మంచు నటిస్తూ, నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమా జూన్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విష్ణు తనయలు అరియానా, వివియానా పాడిన ‘శ్రీకాళ హస్తి’ పాటను విడుదల చేశారు. వీళ్ళిద్దరూ పాడిన ఈ ప్రత్యేకమైన పాటను బుధవారం కాశీ విశ్వనాథ ఆలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మోహన్ బాబు, దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్, రచయితలు తోట ప్రసాద్, ఆకుల శివ, అర్పిత్ రాంకా తదితరులు పాల్గొన్నారు. స్టీఫెన్ దేవస్సీ స్వరపరిచిన ఈ పాట భక్తి, భావోద్వేగాలను ప్రతిబిం బించేలా ఉంది. సుద్దాల అశోక్ తేజ రాసిన సాహిత్యం ‘శ్రీ కాళ హస్తి’ దైవిక వారసత్వాన్ని అందంగా వివరిస్తుంది. విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా ఈ పాటకు ప్రాణం పోస్తూ, ప్రతీ ఒక్కరి హదయాల్ని తాకేలా ఆలపించారు. అలాగే ఈ లిరికల్ వీడియోలో అరియానా, వివియానా కనిపించిన విజువల్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. సుందరమైన ప్రదేశాలలో చిత్రీకరించిన ఈ పాట ఓ విజువల్ వండర్గా అందరినీ మెప్పించనుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.