Saturday, May 17, 2025
Homeతెలంగాణ రౌండప్కొనుగోళ్ల వేగం పెంచాలి..

కొనుగోళ్ల వేగం పెంచాలి..

- Advertisement -

ఆదనపు కలెక్టర్ అశోక్ కుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు
: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ తో కలిసి మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో కొనుగోలుకు సంబంధించి ముఖాముఖి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జ్‌లను ట్యాబ్ ఎంట్రీలను తక్షణమే పూర్తి చేయాలని, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అకాల వర్షాలు వస్తున్నాయని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలువ లేకుండా తక్షణమే కేటాయించిన బిల్లులకు రవాణా చేయాలని ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియలో తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులు గురిచేద్దని ఆయన సూచించారు. అకాల వర్షాలు వస్తున్నందున కొలుగోలు కేంద్రాల్లో టార్ఫాలిన్లు సిద్ధంగా ఉంచాలని ఆయన తెలిపారు.  కొనుగోలు జరిగిన తదుపరి రైతులకు బాధ్యత లేదని కొనుగోలు కేంద్రాలు ఇన్ చార్జీలు పూర్తి బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డిఎస్ఓ శ్రీనాథ్, తహశీల్దార్ రవికుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -