Friday, June 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

- Advertisement -

– కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య అన్నారు.అందులో భాగంగానే విద్యార్థులకు యూనిఫామ్స్ మహిళా సంఘాల ద్వారా కుట్టించి పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.గురువారం మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో ఐకెపి మహిళా సంఘాల చేత కుట్టిన యూనిఫామ్ దుస్తులను ఆయన లాంఛనంగా విద్యార్థినిలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, బలహీనవర్గాలు, రైతుల సంక్షేమంతో పాటు విద్యార్థుల సంక్షేమానికి కూడా కట్టుబడి ఉందని అన్నారు.మండలంలోని అన్ని గ్రామాల్లో కలిపి 2562 మంది విద్యార్థులకు సంబంధించిన యూనిఫామ్ కుట్టే బాధ్యత మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చెప్పిందని, సంబంధిత దుస్తుల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తున్నామన్నారు. రెండు మూడు రోజుల్లో మొత్తం పంపిణీ పూర్తి అవుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య, ఐకెపి ఎపిఎం కుంట గంగాధర్, కస్తూర్బా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గంగమణి,  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి నాయకులు తక్కురి దేవేందర్, కిషన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగెల ప్రవీణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జైడి శ్రీనివాస్, నాయకులు బుచ్చి మల్లయ్య, సింగిరెడ్డి శేఖర్, రంజిత్, శివ, ఐకెపి సీసీలు భలే రావు రవికుమార్, అలేఖ్య, మహిళా సమాఖ్య ప్రతినిధులు, కస్తూర్బా పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -