నవతెలంగాణ-హైదరాబాద్: జాతిపిత మహాత్మాగాంధీని గాడ్సే హత్య చేశారని, మోడీ సర్కార్ తెచ్చిన వీబీ జీ రామ్ జీ(VB-G RAM G act) బిల్లుతో మరోసారి గాంధీని హత్య చేశారని కర్నాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో ఉపాధీ హామీ పథకాన్ని(MGNREGA) రూపొందించి, పేద ప్రజలకు ఉపాధి కల్పించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నిర్ణయంతో పేదలకు రాజ్యంగం కల్పించిన ఉపాధి హక్కు కల్పించిందని, పేద ప్రజలు ఆత్మ గౌరవంతో జీవించారని ఆయన కొనియడారు.
కానీ మోడీ ప్రభుత్వం రాష్ట్రాలను సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకుంది. కొత్తగా తెచ్చిన స్కీమ్ విక్షిత్ భారత్ జి రామ్ జి తో మోడీ సర్కార్ నియంతృత్వ విధానాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఇటీవల శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధీ హామీ చట్టాన్ని పేరు మార్పుతో పాటు స్కీమ్ గా మార్చిన విషయం తెలిసిందే. కొత్త చట్టాన్ని పార్లమెంటులో హడావిడిగా ప్రవేశపెట్టి, డిసెంబర్ 17న ప్రవేశపెట్టి, మరుసటి రోజే ఆమోదించారని, తగినంత చర్చ లేదా సమాఖ్య సంప్రదింపులు లేకుండానే దీనిని ఆమోదించారని ఆయన ఆరోపించారు. ఈ చర్య గ్రామసభలు, గ్రామ పంచాయతీల చట్టబద్ధమైన అధికారాలను తొలగించి, న్యూఢిల్లీలో అధికారాన్ని కేంద్రీకరించడం ద్వారా వికేంద్రీకృత పాలనను బలహీనపరుస్తుందని బెంగుళూర్ మీడియా సమావేశంలో ఆయన దుయ్యబట్టారు.



