Monday, February 2, 2026
E-PAPER
Homeజాతీయంఅజిత్ ప‌వార్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయి: ఎంపీ సంజయ్ రౌత్

అజిత్ ప‌వార్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయి: ఎంపీ సంజయ్ రౌత్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ విమాన ప్ర‌మాదంలో మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మృతిపై విచార‌ణ చేప‌ట్టాల‌ని, నిజ‌నిజాలు నిగ్గు తెల్చాల‌ని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురవ్వడంపై దర్యాప్తు చేయాలని, బడ్జెట్ సమావేశాల్లో ఇదే అంశాన్ని లేవనెత్తుతామని స్పష్టం చేసింది. ఆయ‌న ప్ర‌యాణించిన విమాన‌తీరుపై అనేక అనుమానాలు ఉన్నాయ‌ని దీనివెనుక ఏదో సందేహాస్పదంగా జరిగిందన్న అనుమానం కలుగుతోందన్నారు. రెండుగా చీలిన ఎన్సీపీ విలీనానికి బీజేపీ ఒక అడ్డంకిగా మారిందని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడంపై ఎన్నో అనుమానాలున్నాయని, వాటన్నింటినీ దర్యాప్తు చేసి వాస్త‌వాల‌ను బ‌హిర్గం చేయాల‌ని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -