- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో హైదరాబాద్ సహా పలు పలు చోట్ల వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద భారులు తీరడంపై పౌరసరఫరాల శాఖ స్పందించింది. ‘రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరత లేదు. ప్రజలు భయాందోళనలకు గురికావొద్దు. రిఫైనరీల నుంచి ఇంధన సరఫరా సక్రమంగా జరుగుతోంది. ప్రజావసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. వదంతుల వల్లే ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద క్యూలైన్లు పెరిగాయి’ అని స్పష్టం చేసింది.
- Advertisement -



