Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఎస్సీ గురుకుల బదిలీలు, పదోన్నతుల్లో అవకతవకలు జరగలేదు

ఎస్సీ గురుకుల బదిలీలు, పదోన్నతుల్లో అవకతవకలు జరగలేదు

- Advertisement -

– టీజీఏఆర్‌ఐఈఏ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఎస్సీ గురుకుల ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని టీజీఏఆర్‌ఐఈఏ తెలిపింది. ఈ మేరకు ఆ సంఘం ప్రధాన కార్యదర్శులు ఎ మధుసూదన్‌, బి గణేష్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె జనార్ధన్‌, ఉపాధ్యక్షులు బి బిక్షంయాదవ్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 1274 జీవో నియామకాల కోసం ఇచ్చిందని తెలిపారు. పదోన్నతుల కోసం 1996 స్టేట్‌ అండ్‌ సబార్డినేట్‌ సర్వీసెస్‌ రూల్స్‌ మాత్రమే వర్తిస్తాయని పేర్కొన్నారు. గతేడాది జరిగిన బదిలీల్లో పురుష సిబ్బందికి అమ్మాయిల గురుకులాలకు కేటాయించలేదని వివరించారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ఎస్సీ గురుకుల సొసైటీపై కొందరు పనిగట్టుకుని లేనిపోనివి తప్పుడు ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. జేఈఈ మెయిన్స్‌ రాసిన వారిలో 525 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపికయ్యారని వివరించారు. ఇంటర్‌ ఫలితాల్లో ఎస్సీ గురుకుల విద్యార్థులు ఉత్తమ మార్కులను సాధించారని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad