నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ పర్యటనలో ఆర్జేడీపై ప్రధాని మోడీ తీవ్ర విమర్శులు చేశారు. అధికార కోసం ఆరాటపడేవారు.. తమ సొంత కుటుంబాలను ప్రోత్సహించడంపైనే దృష్టి పెడతారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో దోచుకునే పార్టీలకు ఓట్లు వేయొద్దని ప్రజలను కోరారు. కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి బీహార్ వ్యతిరేక.. పెట్టుబడి వ్యతిరేక కూటమిగా అభివర్ణించారు. ఆ పార్టీలు కారణంగానే బీహార్ పేదరికంలో ఉందని ఆరోపించారు. బీహార్ ప్రజలే ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు వలసదారులుగా వెళ్లిపోయారన్నారు. పిల్లల భవిష్యత్ కోసం ఎన్డీఏ కూటమిని గెలిపించాలని మోడీ పిలుపునిచ్చారు. శుక్రవారం మోడీ బీహార్లో పర్యటించారు. ఈ సందర్భంగా కోట్లాది రూపాయుల ప్రాజెక్ట్లను ప్రారంభించారు. ప్రధాని మోడీ గత ఐదు నెలల్లో బీహార్లో పర్యటించడం ఇది ఐదోసారి. త్వరలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్పై మోడీ ఫోకస్ పెట్టారు.
వాళ్లు అధికారం కోసం ఆరాటపడేవారు: ప్రధాని మోడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES