– దర్యాప్తు చేపట్టనున్న ఏఏఐబీ
అమెరికాకు చెందిన విమాన నిర్మాణ సంస్థ బోయింగ్ రూపొందించిన వైడ్ బాడీ మోడల్స్లో 787-8 డ్రీమ్లైనర్ ఒకటి. అంతర్జాతీయంగా చూసినట్లైతే బోయింగ్ 787 కూలిపోయిన ఘటన ఇదే మొదటిది. ఇండియన్ ఎయిర్లైన్స్లో గత నాలుగు దశాబ్దాల్లో మొట్టమొదటి వైడ్బాడీ విమాన ప్రమాదం కూడా ఇదే. 1985 జూన్లో ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్747 కనిష్క విమానంపై బాంబు దాడి జరిగింది.
కాగా ఈ విమాన ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిండెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేస్తుంది. ఇది పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేస్తుంది. సాధారణంగా భారత గగనతలంలో జరిగే అన్ని తీవ్రమైన విమాన ప్రమాదాలపై ఎఎఐబి దర్యాప్తు చేపడుతుంది. ప్రమాదం జరిగిన ఏడాదిలోగా దర్యాప్తు నివేదికను అందచేస్తుందని భావిస్తున్నారు. ప్రమాదవార్త తెలిసిన వెంటనే ఎఎఐబి ఉన్నతాధికారులు అహ్మదాబాద్ బయలుదేరి వెళ్ళారు.
తొలి సాక్ష్యాధారాలు
సహాయ కార్యకలాపాలు ముగిసిన వెంటనే ఏఏఐబీ రంగంలోకి దిగుతుంది. ప్రమాద స్థలి ప్రాంతాన్ని చుట్టుముట్టి సాక్ష్యాధారాలను ముఖ్యంగా త్వరగా నశించిపోయేవాటిని, తర్వాత కాలానికి అందుబాటులో వుండని వాటిని సేకరిస్తుంది. ఇలాంటి వాటిలో పేలుడు ధాటికి ఆ ప్రాంతాలు, భవనాలపై గల ప్రభావం, శిధిలాల నమోదు, ప్రమాద స్థలి ఫోటోలు, వీడియోలు, శిధిలమైన భాగాలు, ప్రాధమికమైన శిధిలాల పరిశీలన, సాక్షుల ఇంటర్వ్యూలు, జిపిఎస్ పరికరాలు, అక్కడ అందుబాటులో వుండే సిపిటివి ఫుటేజ్ వంటివి సేకరిస్తారు. కొద్ది రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్లతో సహా కీలకమైన భాగాలను, ఇతర సాక్ష్యాధారాలను సేకరించి, వాటిపై పరిశీలన, విశ్లేషణ జరుపుతారు.
ఎటిసి, రాడార్ స్టేషన్లు, వాతావరణ రికార్డులకు సంబంధించిన డేటాను కూడా సేకరిస్తారు. విమానాశ్రయం నుంచి ఎయిర్లైన్స్ వరకు, ఇతర సంబంధిత పక్షాల నుంచి తీసుకోవాల్సిన సమాచారం ఏదైనా వుంటే వాటినికూడా సేకరిస్తారు. మూడు నుంచి ఐదు రోజుల పాటు ప్రాధమిక సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాత దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తారు. బోయింగ్ సంస్థ నుంచి కూడా అవసరమైన సాయం తీసుకుంటారు. దేశ విదేశాల నుండి ప్రత్యేక నిపుణులను కూడా ఈ బృందంలోకి తీసుకుంటారు.
ప్రపంచంలోనే తొలి బోయింగ్ 787 విమాన ప్రమాదమిది!
- Advertisement -
- Advertisement -