నవతెలంగాణ-హైదరాబాద్: గత నెల ఇరాన్లో అదృశ్యమైన ముగ్గురు భారతీయ యువకుల ఆచూకీ లభించింది. దుండగుల చెరలో చిక్కుకున్న వారిని టెహ్రాన్ పోలీసులు సురక్షితంగా కాపాడి బయటకు తీసుకొచ్చినట్టు భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఉద్యోగాల ఆశతో మోసపూరిత వ్యక్తులు, గుర్తింపు లేని ఏజెన్సీల మాటలు నమ్మి, చట్టవ్యతిరేక మార్గాల్లో ఇతర దేశాలకు ప్రయాణించవద్దని ఈ సందర్భంగా ఇరాన్ రాయబార కార్యాలయం భారత యువతకు సూచించింది. ఇలాంటి అక్రమ ప్రయాణాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. యువకులు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక మార్గాల ద్వారానే విదేశీ ప్రయాణాలు చేపట్టాలని సూచించింది.
ఇరాన్లో అదృశ్యమైన ముగ్గురు భారతీయుల ఆచూకీ లభ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES