- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్లోని అంబర్పేట్లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు రామ్ రాజ్ (55) మాధవి (50), శంశాక్గా (20) పోలీసులు గుర్తించారు. అయితే వీరి మృతి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.
- Advertisement -



