Friday, May 30, 2025
E-PAPER
Homeజాతీయంసుప్రీంకోర్టుకు కొత్త‌గా మ‌రో ముగ్గురు జడ్జీలు

సుప్రీంకోర్టుకు కొత్త‌గా మ‌రో ముగ్గురు జడ్జీలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సుప్రీంకోర్టుకు ముగ్గురు జడ్జీలను నియమించినట్లు కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ గురువారం ఎక్స్‌లో ప్రకటించారు. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. అంజరియా, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ విజయ్ బిష్ణోయ్, బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.ఎస్‌.చందూర్కర్‌లను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించాలని కొలీజియం సోమవారం సిఫారసు చేసిందని అన్నారు. భారత రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను వినియోగించుకుని, బారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ)తో సంప్రదించిన తర్వాత .. వారిని సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమిస్తున్నాం అని పేర్కొన్నారు. మాజీ సిజెఐ సంజీవ్‌ ఖన్నా, జడ్జీలు అభయ్ ఎస్‌.ఓకా, హృషికేశ్‌ రాయల్‌లు పదవీ విరమణ చేయడంతో సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు కొలీజియం వారి పేర్లను సిఫారసు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -