- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఛత్తీస్గఢ్లోని బిలాస్పుర్లో ఒకే ట్రాక్పై మూడు రైళ్లు రావడం ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది. ఇటీవల ఇదే రాష్ట్రంలో గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో లోకోపైలట్ సహా 11 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో మూడు రైళ్లను ఒకే ట్రాక్పై చూసిన ప్రయాణికులు కాసేపు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ మూడు రైళ్లు ఒకే ట్రాక్పై ఎందుకు ఉన్నాయనే అంశంపై స్పష్టత లేదు
- Advertisement -



