- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
అన్నారం గ్రామానికి పులి వచ్చిందని అర్ధరాత్రి గ్రామానికి చెందిన ఈరబోయిన రాజేందర్ సోషల్ మీడియాలో సమాచారం పెట్టడంతో, అర్ధరాత్రి పోలీసులు, అటవీ అధికారులు సందర్శించి, తనిఖీ చేయగా ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని, పులి రావడం అవాస్తవమని మాచారెడ్డి ఎఫ్ ఆర్ ఓ దివ్య తెలిపారు. అన్నారం, రెడ్డిపేట్ తాండ తో పాటు పరిసర ప్రాంత అడవుల్లో క్యాబ్ కెమెరాలను అదనంగా ఏర్పాటు చేసి పులి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. రేపు అటవీ అధికారులు గాలింపు చర్యలు నిర్వహించనున్నట్లు దివ్య తెలిపారు.
- Advertisement -