- Advertisement -
నవతెలంగాణ – మాక్లూర్: మండలంలోని మాదాపూర్, ముల్లంగి గ్రామాల మధ్య సబ్ స్టేషన్ సమీపంలో రోడ్డుపై అతి వేగంగా వచ్చిన టిప్పర్ ఎదురుగా వస్తున్న టీవీఎస్ బండిని ఢీ కొనడంతో వ్యతి అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్సై రాజశేఖర్ మంగళవారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మాదాపూర్ గ్రామం నుంచి ముల్లంగి టివిఎస్ పై వెళుతున్న బుర్రోల్ల లక్ష్మణ్ (65) ఎదురుగా వస్తున్న టీఎస్12యుడి 7079 గల టిప్పర్ ఢీ కొనడంతో తీవ్ర గాయాలచ్యాయి. వెంటనే స్థానికులు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలిసుండగా..మార్గ మధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. మృతిని కుమారుడు రాజు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
- Advertisement -